ఈ బ్లాగు ఉద్దేశ్యం నా పాండిత్య ప్రదర్శన కాదు. నాకున్న అనుభవంతో, ఆలోచనతో అవకాశాల మేరకు సమాజంలోని కొన్ని కీలక అంశాల మీద కొన్ని కథనాలు వ్రాస్తున్నాను. నాకూ, మా సంపాదకులకూ నచ్చినవి అచ్చవుతున్నాయి. కానీ వాటిని పాఠకమహాశయులు ఎలా స్వీకరిస్తున్నారో, ఎలా స్పందిస్తున్నారో తెలియదు. ప్రస్తుతం అంతర్జాలం(ఇంటర్ నెట్ ) మేధావులైన పాఠకులకు కేంద్రంగా ఉంది. కనుక అలాంటి వారెవరైనా చదివి, నాభావాలకు మెరుగుదిద్దుతారని ఆశ, ఆకాంక్ష..
A teacher and a journalist. పదహారేళ్ళుగా ఉపాధ్యాయుడిగానూ, ఎనిమిదేళ్ళుగా న్యూస్ కంట్రిబ్యూటర్ గానూ, మూడేళ్ళుగా అనువాదకుడిగానూ చేస్తున్నాను. చదవడం, ఆలోచించడం, వ్రాయడం ఇవీ ఇష్టమైన కార్యక్రమాలు.
మొన్నా మధ్య మా జిల్లాలో ఒక ఆంగ్లమాధ్యమ పాఠశాల విద్యార్థి పాఠశాల ఆవరణలో తెలుగులో మాట్లాడినందుకు అక్కడి ఉపాధ్యాయురాలు దుస్తులను విప్పించి అవమానించిన దుస్సంఘటన ఒకటి జరిగింది. దాన్ని ఖండించడం సాధారణమే, కానీ అసలిలాంటి దుశ్చర్యల మూలాన్ని అన్వేషించి, సంస్కరించే ప్రయత్నం చెయ్యాలనుకున్నాం. దానిలో భాగంగానే ఈ కథనం వ్రాసాను.badi1
శ్రీశ్రీ వ్రాసిన నేనుసైతం గేయంతో స్ఫూర్తిపొందని వారు అరుదుగా ఉంటారు. తెలుగుకు ప్రాచీనభాష హోదా ఇచ్చినప్పుడు, హోదా వల్ల ఒరిగేం లేదు, వ్యక్తులలో మార్పు మాత్రమే నిజమైన భాషాపునరుజ్జీవనానికి దారి తీస్తుందని సూచిస్తూ కథనం వ్రాయాలనుకున్నాం. వెంటనే నేనుసైతం గేయమే గుర్తొచ్చింది. నేను సైతం దాన్ని అనుకరిస్తూ, కథనం వ్రాసేశాను. మీరు సైతం చదివి ఆనందించండి. నేను సైతం తల్లిభాషకు బావుటానై
మాతృభాషా దినోత్సవం సందర్భంగా కృష్ణాజిల్లా సంచికలో గత ఏడాది ఫిబ్రవరి 21న చేసిన కథనమిది. జిల్లా సంచికలో ఆ నేపథ్యం అనివార్యం కనుక అక్కడి వారి పేర్లనే ప్రస్తావించాము. కానీ వారు చేసిన సేవ మాతృభాషకే కానీ ఒక ప్రాంతానికి పరిమితం కాదని మనం గుర్తుంచుకోవాలి. మాతృభాషా దినోత్సవం-09