ఈ బ్లాగు ఉద్దేశ్యం నా పాండిత్య ప్రదర్శన కాదు. నాకున్న అనుభవంతో, ఆలోచనతో అవకాశాల మేరకు సమాజంలోని కొన్ని కీలక అంశాల మీద కొన్ని కథనాలు వ్రాస్తున్నాను. నాకూ, మా సంపాదకులకూ నచ్చినవి అచ్చవుతున్నాయి. కానీ వాటిని పాఠకమహాశయులు ఎలా స్వీకరిస్తున్నారో, ఎలా స్పందిస్తున్నారో తెలియదు. ప్రస్తుతం అంతర్జాలం(ఇంటర్ నెట్ ) మేధావులైన పాఠకులకు కేంద్రంగా ఉంది. కనుక అలాంటి వారెవరైనా చదివి, నాభావాలకు మెరుగుదిద్దుతారని ఆశ, ఆకాంక్ష..
A teacher and a journalist. పదహారేళ్ళుగా ఉపాధ్యాయుడిగానూ, ఎనిమిదేళ్ళుగా న్యూస్ కంట్రిబ్యూటర్ గానూ, మూడేళ్ళుగా అనువాదకుడిగానూ చేస్తున్నాను. చదవడం, ఆలోచించడం, వ్రాయడం ఇవీ ఇష్టమైన కార్యక్రమాలు.
ఈ నెల ౧౩, ౧౪, ౧౫ తేదీలలో విజయవాడలో నిర్వహించిన ప్రపంచ తెలుగు రచయితల రెండో మహాసభల సందర్భంగా మహాకవి విశ్వనాధ సత్యనారాయణ ఇంట్లో ఆయన జ్ఞాపికలను ప్రదర్శనగా ఉంచారు. ఆ సందర్భంగా నేను ఈనాడులో వ్రాసిన వార్తాకథనం.. sabhalu1a